ముందుకు కదలనున్న మెట్రో ప్రాజెక్ట్ పనులు?

metro-ghmc 

ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలిపెట్టిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై గత కొన్ని రోజులుగా వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నగరంలోని చారిత్రక ప్రదేశాల్లోఅక్కడి కట్టడాలు దెబ్బతినకుండా భూగర్భ మెట్రో మార్గం ఏర్పాటు చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.


అయితే అది సాధ్యపడదని నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ చెప్పడంతో మెట్రో పనులు ఆగిపోతాయని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మెట్రో పనులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఅర్ మంగళవారం సచివాలయంలో మెట్రో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జరిగిన చర్చలకు సంబంధించిన ఎలాంటి వివరాలు బయటకి రానప్పటికీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం భూగర్భ మెట్రో మార్గానికి సంబంధించిన ప్రత్యామ్నాయాలను, అలాగే దీనిపై నిపుణుల ఆధ్వర్యంలో సమగ్ర అధ్యయనం చేసి సాధ్యమైనంత త్వరగా తనకు నివేదిక సమర్పించాలని కేసీఅర్ అధికారులని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కు వ్యతిరేకం కాదని, దీనిని పూర్తి చేసేందుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని కేసీఅర్ హామీ ఇచ్చిన్నట్టు సమాచారం. ఇక ఈ మెట్రో పనులు ఏ మేరకు ముందుకు సాగుతాయో వేచి చూడాలి.

No comments:

Post a Comment